పుష్ప రాజ్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓ పక్క డైరెక్టర్ గా వర్క్ చేస్తూనే మరోపక్క పవన్ సినిమాలకు మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక మహేష్ మూవీ తర్వాత త్రివిక్రమ్ చేయబోయేది పుష్ప రాజ్ అల్లు అర్జున్ తోనేనట.

గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చి భారీ విజయాలు అందుకున్నాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కలయికలో నాల్గో సినిమా రాబోతుందని ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప’తో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. అందువలన అల్లు అర్జున్ తో పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు సెట్ చేశాడని అంటున్నారు. ఆల్రెడీ కథ వినిపించడం జరిగిపోయిందనీ, ఈ వేసవిలో పూజా కార్యక్రమాలు ఉంటాయని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో షాహిద్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెపుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఫస్ట్ వన్ ను మించి సెకండ్ పార్ట్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేసాడు.