చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖుల భేటీ

లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా సినీ ఇండస్ట్రీ కూడా రెండు నెలలకు పైగా మూతపడిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ నిబంధనల నుంచి ఒక్కో రంగానికి సడలింపులు వస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమను తిరిగి ఎలా తెరిపించాలన్న విషయమై ఈరోజు కీలక సమావేశం జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు నేడు సమావేశం కానున్నారని తెలుస్తోంది. థియేటర్స్ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం, షూటింగ్స్ ప్రారంభిస్తే, చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ భేటీలో పలువురు నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు హాజరు కానున్నారని తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/