దేశంలో 1,12,359 చేరిన కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో 5,609 మందికి కరోనా..మృతుల సంఖ్య మొత్తం 3,435

coronavirus-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈక్రమంలోనే మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో5,609 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3435కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,12,359కి చేరింది. 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడిచింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/