బంగారం వ్యాపారిపై దుండగులు కత్తులతో దాడి

Unknowns attack with knife on Gold trader
Unknowns attack with knife on Gold trader

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారం వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. విజయవాడకు చెందిన బాధితుడు శ్రీపాల్ జైన్‌ అక్కడి నుంచి ఖమ్మానికి బంగారం తీసుకు వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడి కదలికలను పసిగట్టి, ఖమ్మం రైల్వే మధ్య గేటు ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద 600 గ్రాముల బంగారం, రూ. లక్ష నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. శ్రీపాల్‌ చేతికి, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/