ఈఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు
మీడియాకు ప్రకటన విడుదల చేసిన బత్తిని సోదరులు
హైదరాబాద్: నగరంలో ప్రతి సంవత్సరం కార్తె ప్రవేశించగానే, వేలాదిగా ఉబ్బస రోగులు కోసం వేసే చేప ప్రసాదం ఈసారి పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని మీడియాకు ఓ ప్రకటన ద్వారా బత్తిని హరినాథ్ గౌడ్ తెలియజేశారు. చేప ప్రసాదం ఉందని చెప్పినా, ఎవరైనా ఆన్ లైన్ లో పంపుతామన్నా నమ్మవద్దని, అసలు తాము ఈ ఏడాది ప్రసాదాన్ని తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరూ చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దని వారు కోరారు. ఈ నెల 29తో తెలంగాణలో లాక్ డౌన్ ముగిసినా, తాము ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని, ఎవరైనా తమ పేరిట పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/