ఉత్తమ్పై అసదుద్దీన్ ఓవైసి ఆగ్రహం
ఆయన భాష సరిగా లేదంటూ ట్వీట్
హైదరాబాద్: పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్కు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తొత్తు. అంజనీ కుమార్ అవినీతి పరుడని, రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని తలచింది. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఉత్తమ్ పై విధమైన వ్యాఖ్యలు చేశారు. కాగా ఉత్తమ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అసదుద్దీన్, హైదరాబాద్ సిపిపై ఉత్తమ్ వాడిన భాష సరికాదు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని అన్నారు. దారుస్సలాం అనేది ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక. గతంలో ఈ భారీ మైదానంలో ఇందిరా గాంధీ కూడా బహిరంగ సభను నిర్వహించారు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఏఏపై ఆందోళనలు నిర్వహించడానికి చాలా ఉత్సాంహం చూపిస్తున్నారు. నిజామాబాద్లో తాము ఇదే విషయంపై సభ నిర్వహించామని, అయితే ఆయన పార్టీ మాత్రం పాల్గొనలేదని, మా ఆహ్వానాన్ని తిరస్కరించింది అని అసదుద్దీన్ మరో ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/