నిజాముద్దీన్ తరహలో మరో ఘటన
యూపీలో మదర్సా సమ్మేళనం
తెలంగాణ: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి కారణమైన నిజాముద్దీన్ ఘటన తరహాలో తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్లో ఇటీవల జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళానికి వెళ్లి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అక్కడకు వెళ్లి వచ్చిన వారిని వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సుమారు వంద మంది వరకు వెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో కోందరిని గుర్తించారు. కాగా నిజాముధ్దిన్ తరహాలో మరో ఘటన వెలుగు చూడడంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజ ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/