తెలంగాణలో కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 82,647

corona virus-telangana

హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,896 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,788  మంది కోలుకోగా, 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647కి  చేరింది. ఆసుపత్రుల్లో 22,628 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 59,374  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 645 కు  చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 338  కేసులు, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/