పదో తరగతి పరీక్షల ఫై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి పరీక్షల ఫై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా ఉదృతి నేపథ్యంలో 2021లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ ఏడాది కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించడం వీలు కాలేదు. ఇక 2022లో విద్యాశాఖ టెన్త్ పరీక్షలు నిర్వహించింది. అప్పుడు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇది విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.