తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్: టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 5, 6వ తేదీల్లో అగ్నికల్చర్‌ పరీక్షలు, 7,8,9వ తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 100 శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/