కరోనా మహమ్మారి వ్యాప్తి
24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,711 కేసులు
New Delhi: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,711 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,12, 10,799 కి చేరింది.
ప్రస్తుతం 1,84,523 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా 100 మంది వరకు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,57,756కి చేరింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/