సర్కోలీలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ..హాజరైన సిఎం కెసిఆర్
సర్కోలీ: సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరంగ సభను నిర్వహించింది. బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. జై బిఆర్ఎస్, జై కెసిఆర్ అనే నినాదాలతో సర్కోలీ బహిరంగ సభా ప్రాంగణం మార్మోగుతున్నది. ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. భగీరథ్ బాల్కేతోపాటు పెద్ద సంఖ్యలో చిన్న, పెద్ద నాయకులు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ సిఎం కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికాసేపట్లో సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మాట్లాడనున్నారు.