తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

telangana-assembly-session-begins

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్‌ పేరును, సీపీఐ శాసనాసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేరును స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించింది. సభ్యులందరూ లేచి నిలబడి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్నారు.