ఆ బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: విశాఖపట్నం గాజువాక వాంబే కాలనీలో ఓ మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం చేసిన ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతను తెలియజేస్తోందని టిడిపి నేత లోకేశ్ వ్యాఖ్యానించారు. బాధిత బాలిక తండ్రి, మేనత్తతో తాను ఫోన్ లో మాట్లాడానని, బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చానని వెల్లడించారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆ పాస్టర్ కు కఠినశిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టిడిపి మద్దతుగా నిలుస్తుందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/