కొండపిలో తీవ్ర ఉద్రిక్తత..పోలిసుల అదుపులో టిడిపి ఎమ్మెల్యే
అమరావతిః గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సిపి నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్లేందుకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టంగుటూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయానికి చేరుకున్నారు.
మరోవైపు, వైఎస్ఆర్సిపి తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.