రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించిన టిడిపి

ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

tdp

అమరావతిః రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీలను నియమించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా మాధవీరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామాంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఈ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు. టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.