వినోదాయ సిత్తం రీమేక్ ను ఖరారు చేసిన తనికెళ్ళ భరణి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోవైపు సెట్స్ ఫై ఉన్న సినిమాలే కాకుండా కొత్త సినిమాలకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా , హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకున్నాయి. వీటితో పాటు వినోదాయ సిత్తం మూవీ రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతూ వస్తున్నాయి.

ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడని , మాటలు , స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తుండగా , సముద్రఖని డైరెక్షన్ చేయబోతున్నాడని వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. అయితే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది..పూజా కార్య క్రమాలు ఎప్పుడు జరుపుకోబోతుందనేది తెలియక అభిమానుల్లో అయోమయం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ రీమేక్ ఫై సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి క్లారిటీ ఇచ్చారు.

సార్ సక్సెస్ మీట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..వినోదాయ సిత్తం రీమేక్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక 20 రోజులు కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడని తెలుస్తుంది. కంటెంట్ ప్రకారం అతని క్యారెక్టర్ టైమ్ ని రిప్రజెంట్ చేసే దేవుడి పాత్రలా ఉండబోతుంది అని తెలుస్తుంది.