తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ప్రభుత్వం భద్రతను పెంచింది. రోహిత్ కు 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. ఆ సంఖ్యను 4+4కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వెహికల్ కూడా కేటాయిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈరోజు నుండే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఇటీవల టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మొయినాబాద్ ఫాంహౌస్‌పై దాాడులు చేపట్టి బీజేపీకి సన్నిహితులుగా చెబుతున్న నిందితులను పట్టుకున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రోహిత్ కు భద్రతను పెంచింది.