హన్మకొండ ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించిన గవర్నర్
హన్మకొండ లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని అనూష అనే అమ్మాయి గొంతు కోశాడు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. దాడిలో తీవ్రంగా గాయపడి MGM హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్న యువతి ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ సూపరిటెండెంట్ తో గవర్నర్ ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందిచాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. చదువు రీత్యా అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సమీపంలోని గాంధీ నగర్లో నివాసముంటున్నారు. కాగా తనను ప్రేమించాలని అజహర్ అనే యువకుడు..కొద్దీ రోజులుగా అనూషను వేధింపులకు గురి చేస్తున్నాడు. అనూషనేమో అజహర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న అనూష దగ్గరికి వెళ్లి తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అనూష గొంతును కోసి పరారీ అయ్యాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన అనూష తల్లి..అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అనూషను చూసి షాక్కు గురైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనూషకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు