పాక్‌లో పోలీస్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు

ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పీఎస్ ను ఆక్రమించుకున్న తెహ్రీక్ ఇ తాలిబన్

taliban-militants-seize-police-station-take-hostages-in-northwest-pakistan

ఇస్లామాబాద్ః పాకిస్థాన్ లోని ఒక పోలీస్ స్టేషన్ ను తాలిబాన్ తీవ్రవాదులు ఆక్రమించారు. ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పోలీస్ స్టేషన్ ను తాలిబాన్లు ఆక్రమించినట్టు పాకిస్థాన్ లోని ప్రధాన వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. పాకిస్థాన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… బన్ను కంటోన్మెంట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ను తెహ్రీక్ ఇ తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అక్కడ బంధీలుగా ఉన్న ఆ సంస్థ ఉగ్రవాదులను తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లోని కౌంటర్ టెర్రరిజం బలగాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు తమ వారిని విడిపించుకుపోయారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పై బయటి నుంచి దాడి చేశారా? లేదా పీఎస్ లో అధికారులతో అంతర్గతంగా కుమ్మక్కు అయి చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/