చంద్రబాబు ఫై సజ్జల విమర్శలు

sajjala fire on chandrababu

ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. మాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు హస్తం ఉందని, మాచర్లను చంద్రబాబు అగ్నిగుండం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని టిడిపి నేతలు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని సజ్జల ఆరోపించారు. మర్డర్లు చేసిన బ్రహ్మ రెడ్డి ని మాచర్లకు ఎందుకు తీసుకువచ్చారని.. వాళ్లే అటాక్ చేసి శాంతిభద్రతలు లేవు అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కూడా సజ్జల విమర్శలు చేసారు. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ గెలవదని పవన్ కళ్యాణ్ అంటున్నారని , జగన్ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నారని ఆరోపించారు.