జ్ఞానవాపి మసీదులో ప్రారంభమైన శాస్త్రీయ సర్వే
వారణాసిః ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం ఉదయం ప్రారంభించింది. ఉదయం 7 గంటలకే మసీదు ప్రాంగణానికి చేరుకున్న భారత పురావస్తు శాఖ అధికారులు గట్టి భద్రత మధ్య శాస్త్రీయ సర్వే ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు వరకు సర్వే చేపట్టనున్నారు. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది. కాగా, మసీదు కమిటీ సభ్యులు ఈ సర్వేను బహిష్కరించారు.