జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్..?

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెర కు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్..వెండితెర ఫై రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రతి ఏడాది కమెడియన్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది.

జబర్దస్త్‌లో చేస్తున్నవాళ్లు వేరే టీవీ షోల్లో చేయకూడదనే నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం అంత నడుచుకుంటారు. ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన ముక్కు అవినాష్ మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాడు. ఈ క్రమంలో ఈసారి సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్ కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు చేస్తుండడంతో ఇటు షోను.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేయలేక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడని సమాచారం. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.