గుంటూరులో ఘోరం : ఈసీజీ కోసం ల్యాబ్ కు వెళ్లిన యువతి పట్ల టెక్నీషియన్ నీచమైన పని

ఏపీలో రోజు రోజుకు ఆడవారిపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ చట్టాలకు , పోలీసుల శిక్షలకు ఏమాత్రం భయపడడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట దారుణమైన ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా గుంటూరు లో ఘోరం జరిగింది. ఈసీజీ కోసం ల్యాబ్ కు వచ్చిన యువతి పట్ల టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సదరు వ్యక్తి సూచించాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దుస్తులు తీయకుంటే రిపోర్ట్స్ సరిగా రావని ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని గట్టిగా చెప్పడం తో చేసేది ఏమిలేక సదరు యువతి సిగ్గుతో కళ్లు మూసుకోగా..బల్లపై పడుకోమని చెప్పి ముబైల్ లో ఫోటోలు తీశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హరీష్ అసలు టెక్నీషియనే కాదని ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అసలు టెక్నీషియన్ శంకర్ అనారోగ్యం బారిన పడటంతో అతని స్థానంలో హరీష్ అనే వ్యక్తి పని చేస్తున్నట్లు తెలుస్తుంది.