బెంగళూరు లేడీ సీఈవో కేసు.. ఐలైనర్‌తో టిష్యూ పేపర్‌పై లేఖ

Suchana Seth wrote note with eyeliner, left it in bag with son’s body: Goa Police

బెంగళూరుః కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన కుమారుడ్ని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోవాలోని స్టే అపార్ట్‌మెంట్‌లో 4 ఏళ్ల కుమారుడ్ని సుచనా అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సుచనా ఓ టిష్యూ పేపర్‌పై లేఖ రాసి బాలుడి మృతదేహం పక్కన పెట్టినట్లు గోవా పోలీసులు తాజాగా గుర్తించారు. ఐలైనర్‌ వాడి బాలుడి కస్టడీ అంశాన్ని టిష్యూ పేపర్‌ పై రాసింది. ఏం జరిగినా సరే కుమారుడు తన వద్దే ఉండాలని పేర్కొంది. కోర్టు విడాకులు మంజూరు చేసినా.. కస్టడీ హక్కు మాత్రం తనకే దక్కాలని అందులో రాసినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.

కాగా, సునచాకు వెంకట రామన్‌తో 2010లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థాల కారణంగా విడాకులకు అప్లై చేశారు. 2022 నుంచి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కుమారుడు ఎవరి వద్ద ఉండాలనే దానిపై వాదలను జరగ్గా.. తల్లి వద్ద ఉండేందుకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే, ప్రతి ఆదివారం బాబుతో ఉండేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలు సుచనాను తీవ్ర నిరాశకు గురిచేశాయి. బాలుడు తన తండ్రితో ఉండేందుకు ఆమెకు నచ్చలేదు. భర్తతో ఉన్న విభేదాలు, కోర్టు ఆదేశాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆమె.. చివరికి తన కుమారుడిని హత్య చేసింది.