స్టాప్ ది కౌంట్: ట్రంప్ ట్వీట్
సర్వత్రా ఆసక్తిగా మారిన వైనం
Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకోవటంతో సర్వత్రా ఉత్కంఠ రేగుతున్న విషయం విదితమే.
ఈ తరుణంలో ట్రంప్ చేసిన ట్వీట్ ఇపుడు ఆసక్తికరంగా మారింది.. ‘స్టాప్ ది కౌంట్ అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
దీంతో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలనేది ఆయన అభిమతంగా తేటతెల్లమైంది.. ఎన్నికల అనంతరం పోలయిన ఓ ఒక్క ఓటును కూడ కౌంట్ చేయకూడదంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తూ డెమోక్రాట్లదే విజయం అని దాదాపు తేటతెల్లమవుతోంది. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్కు 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజంలో ఉన్నారు. ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లతో ఉన్నారు.
అయితే స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యం కనబర్చటంతో మాదే గెలుపు అవ్వచ్చు అంటూ ట్రంప్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/