భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 64,959కి ఎగబాకింది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,412 వద్ద స్థిరపడింది.