భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 64,959కి ఎగబాకింది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,412 వద్ద స్థిరపడింది.