భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 2,700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఈరోజు ఏకంగా 1,300కు పైగా లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,328 పాయింట్లు లాభపడి 55,858కి ఎగబాకింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగి 16,658కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/