స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 5.41 పాయింట్లు లాభపడి 62,792.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.15 పాయింట్ల లాభంతో 18,599.00 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.62 వద్ద కొనసాగుతుంది.