ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా లాభాలను కోల్పోతూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 3,895కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50 వద్ద కొనసాగుతుంది.