లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నాటి లాభాలను ఈ రోజు కూడా కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడి 64,113కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,141కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25 వద్ద కొనసాగుతుంది.