లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
![sensex](https://www.vaartha.com/wp-content/uploads/2020/03/sensex-6.jpg)
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నాటి లాభాలను ఈ రోజు కూడా కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడి 64,113కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,141కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25 వద్ద కొనసాగుతుంది.