పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ఓటర్ల స్పందన తెలుసుకున్న రమేష్ కుమార్
![State Election Commissioner visiting polling stations](https://www.vaartha.com/wp-content/uploads/2021/03/State-Election-Commissioner-Nimmagadda-Ramesh-Kumar-talking-to-an-old-woman-at-the-polling-station-1024x583.jpg)
Vijayawada: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో మాట్లాడిన కమిషనర్, పోలింగ్ , క్యూలైన్ల వివరాలుపై ఓటర్ల స్పందన తెలుసుకున్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/