రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు..క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను

2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లు
బడ్జెట్ ద్రవ్యలోటు 6.9 శాతం

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

.2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లు.
.బడ్జెట్ లో ద్రవ్యలోటు 6.9 శాతం.
.2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడమే లక్ష్యం.
.స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు.
.సహకార సంస్థల పన్ను 15 శాతానికి తగ్గింపు. సహకార సంస్థల పన్నుపై సర్ఛార్జీ 7 శాతానికి తగ్గింపు.
.క్రిప్టో కరెన్సీలకు పన్ను మినహాయింపు ఉండదు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను.
.ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు. జనవరి జీఎస్టీ వసూళ్లు రూ. 1,40,986 కోట్లు.
.ట్యాక్స్ రిటర్నులకు రెండేళ్ల సమయం. రిటర్నుల్లో లోపాలను సరిదిద్దుకోవడానికి ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం.
పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.
.ఇకపై సులభతరంగా ఐటీ ఫైలింగ్. 80సీ, 80డీ సెక్షన్లలో ఎలాంటి మార్పు లేదు.
.కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ సంస్థలకు పన్ను మినహాయింపు.
.రక్షణ రంగంలో పరిశోధనల కోసం ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహం.
.సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ. 19,500 కోట్లు.
.రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు.
.డిజిటల్ అస్సెట్స్ బదిలీలపై 30 శాతం పన్ను. గిఫ్ట్ రూపంలో తీసుకునే వాటిపై కూడా పన్ను.
.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్). రాష్ట్ర .ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం.
.గంగా తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు.
.వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్ లు.
.కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం. బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో చూసుకునే అవకాశం.
.ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
.పీపీపీ మోడల్ లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/