బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ‌య్‌కి రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు..

bandi-sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బండి సంజయ్ దిష్టి బొమ్మను తగలపెట్టారు. అంతే కాదు అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ ఫై పిర్యాదులు చేసారు. అలాగే రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ కు పిర్యాదు చేయడం తో ..రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిష‌న్ ఎదుట వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని క‌మిష‌న్ ఆదేశించింది. ఎమ్మెల్సీ క‌విత‌పై సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను మ‌హిళా క‌మిష‌న్ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా తీసుకున్న మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ చేప‌ట్టింది.