ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ

వివరాలు వెల్లడించిన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

supreme court
supreme court

న్యూఢిలీ: ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తుంది.సుప్రీంకోర్టులో ఆరుగురు న్యాయమూర్తులు స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. దీంతో చాలా కేసుల విచారణ వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు. పరిస్థితిపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సమీక్షిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రాంతంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో ప్రభుత్వం కోర్టు ఆవరణలోనే ప్రత్యేకంగా ఒక డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తోంది. జడ్జీలు, లాయర్లు, విజిటర్లకు పరీక్షలు చేయడంతోపాటు వ్యాక్సిన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/