సిరిసిల్ల లో ఓమిక్రాన్ హల్చల్
తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదొక జిల్లాలో ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. ముస్తాబాద్ మండలం గూడెం అనే గ్రామంలో ఓ వ్యక్తి రీసెంట్ గా దుబాయ్ నుంచి సొంత గ్రామానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాగ బాధితుడు గత కొద్ది రోజుల ఆనారోగ్యంతో ఉంటే వైద్యులు పరీక్షలు జరిపి ఓమిక్రాన్ గా గుర్తించారు.
దీంతో ఓమిక్రాన్ సోకిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ లోని టిమ్స్ ఆస్పత్రికి వైద్యులు తరలించారు. వైద్య సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో పాటు సదరు వ్యక్తి కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. కాగ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నమోదు అయిన ఈ కేసు తో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. అయితే ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తే.. ఓమిక్రాన్ తరమి కొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా వైరస్ టీకాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.