డీఏవీ స్కూల్ ఐదేండ్ల బాలిక అత్యాచారం కేసులో..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్ట్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం. 14లోని డీఏవీ స్కూల్ లో ఎల్కేజీ చదువుతున్న ఐదేండ్ల బాలికపై అదే స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్(34) లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న నిందితుడు రజినీకుమార్తో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిపై 376 (ఏబీ) రెడ్విత్ 5 (ఎం), 21 ఆఫ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన నాంపల్లి ఫాస్ట్ట్రాక్ కోర్టు.. రజినీకుమార్ను దోషిగా తెలుస్తూ.. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.