సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 178 పాయింట్ల భారీ లాభాలతో..

బడ్జెట్ రోజున దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

sensex start with gains
sensex start with gains

Mumbai: కేంద్ర బడ్జెట్ రోజైన మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 178 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం లోక్‌సభలో 1 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం విదితమే. కాగా , గత రెండేళ్లుగా కరోనాతో అస్తవ్యస్త మైన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చని మదుపర్లు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/