కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,053 పాయింట్లు నష్టపోయి 70,370కి పడిపోయింది. నిఫ్టీ 333 పాయింట్లు కోల్పోయి 21,238కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.16 వద్ద కొనసాగుతుంది.