లాభాల్లో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 39,983కి పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 11,762కి చేరుకుంది. ఈరోజు ఎనర్జీ సూచీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.34 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/