భారీగా దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: కరోనా ఎఫెక్ట్‌తో గత నాలుగు సెషన్లుగా భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు లాభపడి 29,916కి ఎగబాకింది. నిఫ్టీ 482 పాయింట్లు పెరిగి 8,745కి చేరుకుంది. ఈ నాటి ట్రేడింగ్ లో అన్ని సూచీలు లాభపడ్డాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/