నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారాన్ని మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్లు నష్టపోయి 61,002కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 17,944 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.81 వద్ద కొనసాగుతుంది.