మరోసారి భారత్-చైనా సైనికాధికారుల చర్చలు
తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయ వద్ద చర్చలు
న్యూఢిల్లీ: చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి ఆర్మీ అధికారుల భేటీ అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఈరోజు మరోసారి గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల మేజర్ జనరల్ స్థాయి సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగిన ప్రాంతంలోనే ఈ రోజు చర్చలు జరగనున్నాయి. 1962లో భారత్-చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి గాల్వన్లోయ వద్ద అంతగా గస్తీ చర్యలు చేపట్టలేదు. అయితే, ఇప్పుడు గాల్వన్లోయ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. దీంతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. చైనా సైనికులు పక్కా వ్యూహం ప్రకారం పాల్పడిన చర్యలతోనే గాల్వన్లోయలో సోమవారం ఘర్షణలు చెలరేగాయని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/