కోర్టు తీర్పు తర్వాతే మండల పరిషత్ ఎన్నికలు

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ నీలం సాహ్ని

SEC Neelam Sahni in a video conference
SEC Neelam Sahni

Amaravati: మండల పరిషత్‌ ఎన్నికలపై కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని అన్నారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో  వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ రాజ్‌ అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం కానున్నారు. పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకోనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/