అభిమానులకు షాకింగ్ విషయాన్నీ తెలిపిన సమంత…
క్రేజీ హీరోయిన్ సమంత అభిమానులకు షాకింగ్ విషయాన్నీ తెలిపింది. తాను మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి ఒక్కసారిగా వారిని షాక్ కు గురి చేసింది. మయోసిటిస్ వ్యాధి లక్షణాలతో బాధపడేవారు ఎక్కువ సేపు నడవలేరు.. అలానే నిల్చోలేరు. కండరాలు బలహీనంగా మారుతుంటాయి. అలానే అతిగా నీరసం కూడా వస్తుంటుంది. అలాంటి ఈ వ్యాధి తనకు వచ్చిందని.. చాలా రోజుల నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ విషయం ఎప్పుడో చెప్పాలని భావించిందట. కానీ ప్రతీది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదట. లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజ్లని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే అని సమంత చెప్పుకొచ్చింది. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇటీవల భరించలేని కష్టాలు వచ్చాయని గుర్తు చేసుకున్న సమంత.. అవి గడిచిపోయినవిగా చెప్పుకొచ్చింది. ఈ మయోసిటిస్ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నీ చెప్పిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నడిచిన యశోద చిత్రం నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా తాలూకా ట్రైలర్ విడుదలై ఆసక్తి పెంచింది. సరోగసీ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ మూవీలో సమంత గర్భవతిగా కనిపిస్తోంది.