‘ముఠా మేస్త్రీ’ జ్ణాపకాలను గుర్తుచేసుకున్న మంత్రి రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా..రాజకీయాల్లోకి రాకముందు సినీ నటిగా యావత్ ప్రేక్షక అభిమానాన్ని చొరగొన్నది. హీరోయిన్ గా , అలాగే తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భాంగా ఆయనకు బెస్ట్ విషెష్ అందజేసి..ఆయనతో కలిసి నటించిన ‘ముఠా మేస్త్రీ’ చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపిన అనంతరం ..తను స్కూల్ డేస్ నుంచి చిరంజీవి అభిమానినని పేర్కొంది. ‘ఆలయ శిఖరం’ సినిమా షూటింగ్ టైమ్ లో ఆయన వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయాన్నీ గుర్తు చేసుకుంది. తనకు ‘ఘరానా మొగుడు’ సినిమాలో అవకాశం వచ్చి మిస్ అయిందని, ఆ తర్వాత ‘ముఠా మేస్ట్రీ’లో మెయిన్ హీరోయిన్ గానటించే ఛాన్స్ దక్కిందన్నారు. ఇక ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ చాలా బాగా చేశారని తెలిపిన రోజా..షూటింగ్ లో ఫస్ట్ ఫస్టే ‘ఎంత ఘాటు ప్రేమయో’ సాంగ్ షూట్ చేశారని గుర్తు చేసుకుంది. ఇక ఆ తర్వాత ‘రాజశేఖరా’ సాంగ్.. తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పింది.

‘ముఠా మేస్త్రీ’ షూటింగ్ టైమ్‌లో తను భయపడిపోయి వాంప్టింగ్స్ చేసుకున్నానని తెలిపింది. బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతున్నపుడు ఆ ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. చిరంజీవి ‘ముఠా మేస్త్రీ’ , ‘బిగ్ బాస్’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల్లో కథానాయికగా రోజా నటించింది. తాను ఇప్పుడు పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నానని, చాలా మంది సినిమాలు చేయాలని అడుగుతున్నారని , కానీ, టైమ్ లేక చేయడం లేదని చెప్పిన రోజా.. చిరంజీవి అడిగితే తప్పకుండా ఆయన సినిమాలో నటిస్తానని తన మనసులో మాట బయటకు తెలిపారు.