పవన్‌ అప్పుడు గాడిదలు కాశాడా అంటూ మంత్రి రోజా విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి వైస్సార్సీపీ మంత్రులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఆదివారం సత్తెనపల్లి లో ఏర్పటు చేసిన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తనను విమర్శిస్తున్న వైస్సార్సీపీ గాడిదలను హెచ్చరిస్తున్న అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేతలు స్పందిస్తున్నారు.

ఇప్పటికే పలువురు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయగా..తాజాగా మంత్రి రోజా సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడిన పవన్‌.. సన్యాసం తీసుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడని మంత్రి రోజా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు.

కల్యాణ్‌ వీకెండ్‌ రాజకీయాలు చేస్తున్నారని, సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో ఏపీకి వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే జనం ఆదరించరన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజలకు ఫుల్‌టైమ్‌ అందుబాటులో ఉండాలని, వీకెండ్‌లో ఏపీకి వస్తే.. ప్రజలు టూరిస్టుగానే చూస్తారన్నారు. చంద్రబాబు, పవన్‌కు రాష్ట్రంలో ఓటు, ఇల్లు, అడ్రస్‌ ఉందా..? అని ప్రశ్నించారు. బీసీ గురించి మాట్లాడే అర్హత పవన్, చంద్రబాబుకు లేదని మంత్రి రోజా అన్నారు. పవన్‌ నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పవన్‌ను, ఆయన వారాహి వాహనాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేసినప్పుడు పవన్‌ ఏం చేశాడు..? పోలవరంపై చంద్రబాబును పవన్‌ ఏనాడైనా ప్రశ్నించాడా..? ప్రశ్నించకుండా గతంలో గాడిదలు కాశాడా..? అని మంత్రి రోజా పవన్ ను ప్రశ్నించింది.