పవన్ కళ్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేసిన మంత్రి రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా ఈ మధ్య పవన్ కళ్యాణ్ ను మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నారు. వరుసగా ఘాటైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈమె కామెంట్స్ ఫై మెగా అభిమానులు , జనసేన కార్య కర్తలు , పవన్ కళ్యాణ్ తో పాటు చిత్రసీమ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ..రోజా మాత్రం ఆమె కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె ..ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు భౌ.. భౌ.. అని అరుస్తున్నారని.. మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే.. ఒక పద్యం గుర్తొసొందన్నారు.

‘అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను.. సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా’ అని వేమన రాసిన పద్యాన్ని రోజా గుర్తు చేశారు. రాష్ట్రంలో సజ్జనుడు జగన్‌ అని.. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారని చెప్పారు. వారంతా గుంపులు గుంపులుగా వస్తున్నారని.. ఎంత మంది కలిసొచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. కంచు మోగినట్టు.. వారంతా వీకెండ్‌ పొలిటీషియన్స్ మాత్రమేనని.. పరోక్షంగా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు రోజా. అల్పుణ్ని కంచుతోను.. సజ్జనుణ్ని బంగారంతోనూ వేమన పోల్చారు. సజ్జనుడనే మాటకు సీఎం జగన్‌ ఉదాహరణ అని వివరించారు. పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను చూసి చలించిపోయి.. ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని.. సంక్షేమానికి నడుం బిగించారని మంత్రి వివరించారు. మరి దీనిపై జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి.