పవన్ కళ్యాణ్ మరోసారి ఘటన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసారు వైస్సార్సీపీ మంత్రి రోజా. తెగిన గాలిపటంలా పవన్ పరిస్థితి మారిందన్నారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని రోజా అన్నారు. రౌడీయీజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతూ ఆయన ప్రవర్తన చూసి ప్రధాని దూరం పెట్టారన్నారు. ప్రజలు కూడా పవన్ గురించి ఆలోచించడమే పూర్తిగా మానేశారన్నారు.

పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ప్రజాబలం లేదని బిజేపి నేతలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. అందుకే మొన్న విశాఖ టూర్ లో పవన్ ను పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు. కిరణ్ రాయల్ పై నేను కంప్లైంట్ చేయలేదని… నేను అతనితో ఫోన్ లో మాట్లాడలేదని స్పష్టం చేశారు. “నన్ను జైల్లో పెట్టాలంటే ఫస్ట్ నేను తప్పు చేయాలి.. నేను తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే బహిర్గాతం చేయండి. రోజాను మాట్లాడితే ఫేమస్ అవ్వొచ్చని , పబ్లిసిటి వస్తుందని , మీడియా ప్రయారిటీ ఇస్తుందని, ఇలాంటి వారంతా నాపై నోరుపారేసుకుంటున్నారు. కిరణ్ అనే వ్యక్తి రాయల్ అని తన పేరు పక్కన వ్యాపారం కోసమే చేర్చుకున్నాడు. జనసేనకు , పవన్ కు అతని వల్ల నష్టం తప్ప లాభం లేదు” అని రోజా అన్నారు.