పొంగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం

దారి కనిపించక ఢీకొన్న వాహనాలు.. 12 మందికి తీవ్ర గాయాలు

Road accident in uttarpradesh
Road accident in uttarpradesh

లక్నో: పొగమంచు కారణంగా వాహన చోదకులకు దారి కనిపించక పోవడంతో మూడు కార్లు, బస్సు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టాయి. వాటిలో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉత్తర భారతాన్ని దట్టంగా పొగమంచు కమ్మేస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు కూడా వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్స్ ప్రెస్ వే పై వరుసగా మూడు కార్లు వస్తున్నాయి. ముందు బస్సు వేళ్తోంది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో దీన్ని గుర్తించేలోగానే వెనుక వచ్చే వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదాలు జరుగుతున్నందున వాహన చోదకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/